బియ్యప్పిండితో భలే అందం!
ఇంట్లోనే సౌందర్య చికిత్సలు చేసుకునేవారు ఈసారి అందుకోసం బియ్యప్పిండిని ఉపయోగించి చూడండి. దీనివల్ల చర్మానికీ ఎంతో మేలు జరుగుతుంది. ఎలాగంటే...
* రెండు చెంచాల బియ్యప్పిండిలో కొద్దిగా తేనె, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది.
* చెంచా బియ్యప్పిండిలో నాలుగైదు చుక్కల ఆముదం కలిపి కళ్ల కింద పూత వేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే వలయాలూ, ముడతలు క్రమంగా దూరమవుతాయి.
* పాలూ లేదంటే పాల మీగడలో కొద్దిగా బియ్యప్పిండి చేర్చి పూత వేసుకోవాలి. పదినిమిషాల తరవాత చల్లటినీళ్లతో కడిగేసుకుంటే మురికి తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది.
* చర్మం మీద మృతకణాలు పేరుకుపోతే నిర్జీవంగా తయారవుతుంది. అలాంటప్పుడు బియ్యప్పిండిలో తేనె లేదంటే ఆలివ్నూనె కలిపి స్నానానికి ముందు మర్దన చేసుకుంటే మతృకణాలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖం కళగానూ మారుతుంది.
No comments:
Post a Comment