ఏదో ఒకటి వాడేయకండి!
ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడిబారడం. దానికి ఏదో ఒక క్రీం రాసుకోవడం కన్నా.. ఆ సమస్యకు అసలైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
చల్లగా ఉందని వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంటే మానేయండి. ఆ వేడి చర్మం తేమని లాగేస్తుంది. దాంతో పొడిబారుతుంది. బదులుగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.
* చర్మం బాగా పొడిబారినప్పుడో.. గుర్తొచ్చినప్పుడో తప్ప మాయిశ్చరైజర్ రాసుకోరు కొందరు. మీరు ఆ పొరపాటు చేస్తున్నారేమో గమనించుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మరేం చేయాలంటారా.. స్నానం చేసిన వెంటనే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడిబారే సమస్య అదుపులో ఉంటుంది.
* అవసరానికి మించి ముఖానికి స్క్రబ్ వాడుతున్నా.. రకరకాల ప్రయోగాలు చేస్తున్నా కూడా చర్మం పొడిబారుతుంది. అందుకే ఓ పని చేయండి. రెండు చెంచాల చక్కెరలో కాస్త కొబ్బరి లేదా ఆలివ్నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి.
* సబ్బుల్లోని రసాయనాలూ ఈ సమస్యకు కారణం అవుతాయి. కాబట్టి మీ చర్మతత్వానికి సరిపోయే ఫేస్వాష్ని నిపుణుల సలహాతో ఎంచుకోండి. మార్పు కనిపిస్తుంది.
No comments:
Post a Comment