Thursday 26 January 2017

నల్లటి వలయాలకు గులాబీనీరు!

నల్లటి వలయాలకు గులాబీనీరు!


రకరకాల కారణాల వల్ల కళ్ల అడుగున నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. వీటి వల్ల కళ్లతో పాటు, ముఖంలోనూ కళ పోతుంది. వాటిని దూరం చేసుకోవాలంటే..
చెంచా నిమ్మరసం, రెండు చెంచాల టొమాటో గుజ్జూ, చిటికెడు బియ్యప్పిండీ, పసుపూ తీసుకుని అన్నింటినీ కలిపి కళ్ల అడుగున పూతలా రాసుకోవాలి. పావు గంట తర్వాత దాన్ని కడిగేస్తే చాలు. 
మార్కెట్లో విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ దొరుకుతాయి. వాటికి తగినంత తేనె చేర్చి కళ్ల కింద రాసి ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. చెంచా టొమాటో గుజ్జుకు అరచెంచా నిమ్మరసం చేర్చి సమస్య ఉన్న చోట రాసి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసినా చాలు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం తొందరగా కనిపిస్తుంది.
గులాబీ నీళ్లలో నలుపు దనాన్ని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు కణాలను గట్టిగా ఉంచడమే కాక, చర్మానికి నిగారింపునూ ఇస్తాయి. అందుకే రోజూ గులాబీ నీళ్లు కళ్ల చుట్టూ రాస్తూ ఉండాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment